జనసేన పార్టీ రాష్ట్రకార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించిన పవన్‌ కళ్యాణ్

JanaSena Party Chief, JanaSena Party Chief Pawan Kalyan, JanaSena Party Chief Pawan Kalyan Hoists National Flag at JanaSena Party Office, JanaSena Party Office, Mango News, pawan kalyan, Pawan Kalyan Hoists Flag at Janasena Party Office, Pawan Kalyan Hoists National Flag, Pawan Kalyan Hoists National Flag at JanaSena Party Office, Pawan Kalyan hoists national flag in Mangalagiri, Pawan Kalyan Unfurls National Flag

దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. అనంతరం జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పరాయి దేశ పాలకులను తరిమి కొట్టేందుకు ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. నాటి త్యాగాలు, ఉద్యమ స్పూర్తి నేటి తరంలో రావాలన్నారు. రెండు వేలు ఇచ్చి ఓట్లు కొనుక్కునే విధానం, ఓటు అమ్మకునే విధానం మారాలని చెప్పారు. ప్రపంచ దేశాల అభివృద్ధి లో భారతీయుల పాత్ర ఎంతో ఉందని, కానీ మన‌దేశానికి వారు సేవలు అందించ లేకపోతున్నారన్నారు. అందుకు మన రాజకీయ నాయకులే ప్రధాన కారణమని చెప్పారు. కొత్త తరం నాయకులు, కొత్త రాజకీయం రావాలని, ఓటు‌వేసే ముందు సామాజిక ప్రయోజనాలా, వ్యక్తిగత ప్రయోజనం కావాలా అనేది ఆలోచించాలన్నారు. ప్రజల్లో ఈ ఆలోచన వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 8 =