ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో 13 కొత్త మెడికల్ కళాశాలలకు అనుమతి, మంజూరుపై కేంద్ర మంత్రితో సీఎం వైఎస్ జగన్ చర్చించారు. అలాగే ఆరోగ్యరంగంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ నియంత్రణపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు శనివారం ఉదయం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఇక ఈ పర్యటనలో మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా సీఎం భేటీ కానున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ