ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 23, 24, 25 తేదీలలో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా 23వ తేదీ సాయంత్రం సీఎం తాడేపల్లి నుంచి బయలుదేరి, ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఇక 24వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అలాగే చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండు, డిపో నిర్మాణం, ఏపీ క్లార్ భవన నిర్మాణం సహా ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక 25వ తేదీన ఉదయం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం పాల్గొంటారు. ఆతరువాత కడప విమానాశ్రయానికి చేరుకొని నుంచి ప్రత్యేక విమానంలో సీఎం వైఎస్ జగన్ రాజమండ్రికి బయలుదేరి వెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ