ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ప్రకటించిన జిల్లాల పునర్వవస్థీకరణపై సీఎం జగన్ నేడు (గురువారం) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యన్నారాయణ సహా ప్లానింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్తగా తీసుకున్న జిల్లాల విభజన నిర్ణయంపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను అధికారులు సీఎం జగన్ కి వివరించారు. ప్రభుత్వం ప్రకటించిన జిల్లాలతో పాటుగా మరికొన్ని జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయని వారు సీఎంకి తెలిపారు.
జిల్లాల పునర్వవస్థీకరణపై ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ అధికారులకు సూచించారు. అలాగే, ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి వచ్చిన వినతులను, అభ్యంతరాలను సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. పునర్వవస్థీకరణ అమలులో భాగంగా ఎదురవనున్న సమస్యల పరిష్కారానికై అధికారులు ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ