మచిలీపట్నంలో బాలశౌరికి అనుకూల పవనాలు

Favorable Winds For Balashauri In Machilipatnam,Janasena,Balashauri,Machilipatnam,YCP,Pithapuram,Janasena,TDP,BJP,Chandrababu,Pawan Kalyan,YCP,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,Janasena News,Pithapuram Elections,Janasena Pithapuram,Machilipatnam Janasena MP candidate,Janasena MP candidate Balashauri,Balashauri Latest News,Machilipatnam Politics

రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన రెండు స్థానాల్లో పోటీ చేస్తుండటంతో..ఆ రెండు చోట్లా  కూడా గెలుపు ఖాయమేనని  రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం అయిన మ‌చిలీ ప‌ట్నం  నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి.. జ‌న‌సే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే  టీడీపీ క‌లిసి రావ‌డంతో పాటు జ‌న‌సేనకు బ‌లం ఉండడంతో ఈయ‌న గెలుపు త‌థ్య‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి తోడు వైసీపీ టికెట్ ఇవ్వ‌లేద‌న్న సానుభూతితో పాటు వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ ఆయనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

ఏపీ  వ్యాప్తంగా ఉమ్మ‌డి పార్టీల నేత‌ల మ‌ధ్య చాలావరకూ  స‌మ‌న్వ‌య లోపం  కొట్టొచ్చనట్లు క‌నిపిస్తోంది. టికెట్లు ఆశించి ద‌క్క‌క పోవ‌డంతో మిత్ర‌ప‌క్షాల నాయ‌కుల‌తో చేతులు క‌లిపడానికి  ముందుకు రావ‌డం లేదు. కానీ, మ‌చిలీప‌ట్నంలో మాత్రం ఆ సీన్ కనిపించడం లేదు.  మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ నేతృత్వంలో అంతా కలిసే ముందుకు సాగుతున్నారు. నారాయ‌ణ‌కు  ఈ విషయం చంద్ర‌బాబు ముందే చెప్ప‌డం.. ఆయ‌న‌కు కూడా అక్కడ పోటీపై ఇంట్ర‌స్ట్ లేక పోవ‌డంతో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి ప‌నిచేస్తున్నాయి.

అంతేకాదు మ‌చిలీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో కాపులు, బీసీలు ఎక్కువ‌గా ఉండటంతో.. వారంతా జ‌న‌సేన‌కు జై కొడుతున్నారు. పార్టీతో పని లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే అక్కడి కాపులు ప్రాణం పెడుతుండటంతో..వారి  ఓట్లు గంపగుత్త‌గా బాల‌శౌరికే ప‌డ‌నున్నాయి. అలాగే బీసీలు మొదటి నుంచీ  టీడీపీతోనే ఉండటంతో వారంతా బాల‌శౌరికే విజ‌యం ద‌క్కేలా స‌హ‌క‌రించ‌నుండటం..జ‌న‌సేన‌కు ఇప్పుడు బ‌లంగా మార‌నున్నాయి.

ఐదేళ్లు అధికార వైసీపీలోనే ఉన్న బాల‌శౌరికి  సీఎం జగన్ ఎన్నిక‌ల‌కు ముందు అదే టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన హర్ట్ అయ్యారు. అయినా కూడా  మౌనంగా బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌న‌సేన త‌ర‌పున టికెట్ తెచ్చుకున్నారు. ఇదే విష‌యాన్ని ఇప్పుడు ఆయ‌న ప్ర‌చారంలో  పదేపదే ప్ర‌స్తావిస్తున్నారు. తాను ఐదేళ్లు నమ్మిన బంటుగా ఉన్నా కూడా పార్టీ త‌న‌కు టికెట్ ఇవ్వలేదని..ఇది మోసం చేయ‌డం కాదా? అని బాలశౌరి ప్ర‌శ్నిస్తూ సెంటిమెంటును రగిలిస్తున్నారు.  దీంతో సానుభూతిపరుల ఓట్లు  బాల శౌరికే అన్న టాక్ నడుస్తోంది.

దీనికితోడు బాల శౌరి  ఐదేళ్లుగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంతో మెజారిటీ ఓట్లు ఆయనకే పడతాయన్న లెక్కలున్నాయి.  మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌త్య‌ర్థుల‌ను తిట్టడం కాదని.. బాలశౌరిలా అభివృద్ది చేసి చూపించాల‌ని అక్కడి వారు మెచ్చుకునే స్థాయిలో ఆయనున్నారు. దీంతో ఆయన విజయం రాసిపెట్టిపెట్టుకోవచ్చంటూ స్థానికంగా టాక్ నడుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + twelve =