ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “చిరస్మరణీయుడు..శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి” అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. దివంగత ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, రచయిత, జర్నలిస్ట్ విజయార్కె “చిరస్మరణీయుడు..శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు” అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను సీఎం వైఎస్ జగన్ నెమరువేసుకున్నారు. అలాగే ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, రచయిత డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారధి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE