ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి ఈ ఏడాది మూడో విడత సాయం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి 50,58,489 మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,036 కోట్ల నగదును సీఎం వైఎస్ జగన్ బదిలీ చేశారు. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా రైతుల ఖాతాల్లో మూడో విడత నిధులు జమచేసినట్టు అయింది.
రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతుకు సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.13750 అందిస్తుండగా, మొదటి విడతగా మేలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో సంక్రాతి సమయంలో రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. కాగా ఈ రోజు విడుదల చేసిన రూ.1,036 కోట్లతో కలిపి ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం రూ.19,812.79 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ