ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఊరందూరు గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ముందుగా ఊరందూరులో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పైలాన్ని ఆవిష్కరించారు. అలాగే తొలివిడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను కూడా సీఎం ప్రారంభించారు.
రాష్ట్రమంతటా ఇళ్ల పట్టాల పండుగ, ఇంటి నిర్మాణం పండుగ జరుగుతోంది:
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, “రాష్ట్రమంతటా కూడా పండుగ జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, కొత్తసంవత్సరం ప్రారంభం మొదలు సంక్రాతి వరకు పండుగే జరుగుతుంది. ఇళ్ల స్థలాల పండుగ, ఇంటి నిర్మాణం ప్రారంభించే పండుగ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రతి యొక్క గ్రామంలోనూ, పట్టణంలోనూ ఇళ్లులేని అక్కచెల్లమ్మలకు వారి ప్రతి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ స్థలాలలో 28.30 లక్షల ఇళ్లు, ఇవిగాక 2.62 లక్షల టీడ్కొ ప్లాట్లు కలిపి మొత్తం 30 లక్షల 75 వేలు ఇళ్లను రెండు దశల్లో కట్టించే కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్నాం. మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. అందులో భాగంగా మొదటి దశలో 1,78,840 ఇళ్లను చిత్తూరు జిల్లాకు మంజూరు చేశాం” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ