మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 28, సోమవారం నాడు 2498 కరోనా కేసులు, 50 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,22,048 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 49,305 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 4,501 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 18,14,449 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.4 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.57 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 57,159 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఇప్పటికి 1,25,43,772 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ