ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో విద్యుత్తు బిల్లులపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జూన్ 30 వరకూ విద్యుత్తు బిల్లుల చెల్లింపులను వాయిదా వేయాలని పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ఏపీలో కొన్ని చోట్ల బిల్లులు అధికంగా రావడంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చి, పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
లాక్డౌన్ వలన రెండు నెలల బిల్లు ఒకేసారి తీయడంతో టారిఫ్ మారిపోయి ప్రజలకు వేలల్లో కరెంట్ బిల్లులు రావడంతో బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో విద్యుత్ బిల్లుల చెల్లింపును జూన్ 30వ తేదీ వరకూ వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విద్యుత్ బిల్లులపై ఏర్పడ్డ అనుమానాలను తొలగించేలా ప్రతీ వినియోగదారుడికీ వివరిస్తూ లేఖలు రాయాలని రాష్ట్ర ఇంధనశాఖ నిర్ణయించింది. 1.45 కోట్ల విద్యుత్ వినియోగదారులకు లేఖలు రాసే బాధ్యతను విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలకు రాష్ట్ర ఇంధనశాఖ అప్పగించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu