ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మే 14, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2100 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 9,256 సాంపిల్స్ ని పరీక్షించగా 68 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. వీటిలో 32 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకి చెందినవిగా (మహారాష్ట్ర 29, ఒడిశా 2, పశ్చిమ బెంగాల్ 1) పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 105 (మహారాష్ట్ర 67, గుజరాత్ 26, ఒడిశా 10, పశ్చిమ బెంగాల్ 1, కర్ణాటక 1) మందికి కరోనా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు.
కొత్తగా నెల్లూరు జిల్లాలో 15, చిత్తూరులో 9, గుంటూరులో 5, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో 2 కేసుల చొప్పున, పశ్చిమ గోదావరిలో ఒక కేసుతో కలిపి మొత్తం 36 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే నెల్లూరులో 12, చిత్తూరు జిల్లాలో నమోదైన 8, పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదైన ఒక్క పాజిటివ్ కేసుతో కలిపి మొత్తం 21 కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినవిగా చెప్పారు. ఇక ఈ వైరస్ వలన ఇప్పటివరకు 48 మంది మృతి చెందగా, మరో 1192 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో 50 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడినట్టు ప్రకటించారు. ఇక ప్రస్తుతం 860 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మే 13, బుధవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1367 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 31 మందికి, వలస వచ్చిన వారికీ 10 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 34 మంది మృతి చెందగా, 939 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 394 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
*రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 36 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
*రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2100 పాజిటివ్ కేసు లకు గాను 1192 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860.#APFightsCorona pic.twitter.com/dogQDfkMlN— ArogyaAndhra (@ArogyaAndhra) May 14, 2020
Media bulletin
Date: May 13, 2020Status of positive cases of #COVID19 and also a list of districts with zero active cases in Telangana. pic.twitter.com/WkeZ0DOjZM
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 13, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu