ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 24, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా జూన్ 27న చేపట్టే జగనన్న అమ్మఒడి పథకం నిధుల విడుదల, పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు, బైజుస్తో ఒప్పందం, విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణి, పలు సంస్థలకు భూముల కేటాయింపు, కరోనా వ్యాప్తి, సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF