ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 25 న బెంగళూరుకు వెళ్లనున్నారు. 26వ తేదీ కూడా సీఎం వైఎస్ జగన్ అక్కడే ఉంటారని, 27 న తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. సీఎం వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన ఇన్సీడ్ బిజినెస్ స్కూలులో సీటు వచ్చింది. ఈ నేపథ్యంలో తన కుమార్తెను పారిస్కు పంపేందుకు సీఎం వైఎస్ జగన్ బెంగళూరుకు వెళుతునట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu