దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు లక్షకంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 83,876 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,22,72,014 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 895 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,02,874 కి పెరిగింది. ఇక దేశంలో కొత్తగా ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది (1,99,054) కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,06,60,202 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.19 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ప్రస్తుతం 11,08,938 (2.62%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక గత 24 గంటల్లో కేరళ (26729), మహారాష్ట్ర (9666), కర్ణాటక (8425), తమిళనాడు (6120), మధ్యప్రదేశ్ (5171), రాజస్థాన్ (4509), గుజరాత్ (3897), ఉత్తర్ ప్రదేశ్ (2774), ఆంధ్రప్రదేశ్ (2690), ఒడిశా (2106) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద సోమవారం ఉదయం 7 గంటల వరకు 169.63 కోట్ల (1,69,63,80,755) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు. అలాగే గత 24 గంటల్లో 14.70 లక్షలకుపైగా (14,70,053) వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ