ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎం పర్యటన ఖరారైంది. జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఊరందూరు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు చేరుకుంటారు. ముందుగా ఊరందూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్ను సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పట్టాలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా తదితరులు పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ