ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 402 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 22, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,339 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 7082 కి పెరిగింది. గత 24 గంటల్లో 412 మంది కరోనా నుంచి రికవరీ అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కృష్ణాలో ఇద్దరు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు మరణించారు. అలాగే ఒకేరోజులో 56,425 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, ఏపీలో మొత్తం పరీక్షల సంఖ్య 1,13,57,530 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (డిసెంబర్ 22, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,79,339
- కొత్తగా నమోదైనా కేసులు : 402
- నమోదైన మరణాలు : 4
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,68,279
- యాక్టీవ్ కేసులు : 3978
- మొత్తం మరణాల సంఖ్య : 7082
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ