ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (నవంబర్ 30, బుధవారం) అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతి మూడు నెలలకొకసారి అనగా మొత్తం నాలుగు విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు మదనపల్లె బీటీ కాలేజ్ గ్రౌండ్స్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొని జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, 3.10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా నేతలు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE