ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 29, శుక్రవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నట్టు తెలుస్తుంది. అలాగే ఏప్రిల్ 30న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు జరగనుంది. సత్వర న్యాయం అందించడం, వ్యాజ్యాల పెండింగ్ సమయాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాల కల్పన మరియు న్యాయవ్యవస్థలో పెరుగుతున్న ఖాళీల భర్తీ ఎజెండాతో జరగనున్న ఈ సదస్సుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధాని నరేంద్ర మోదీ, ఇద్దరు అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రోజు మొత్తం జరిగే ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ