ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 15, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం వైఎస్ జగన్ భేటీ కానునట్టు తెలుస్తుంది. ముందుగా రేపు రాత్రి 9 గంటలకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, విభజన చట్టం హామీల అమలు, తదితర అంశాలపై చర్చించే అవకాశమునట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ