ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 18న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, సబ్ స్టేషన్ నిర్మాణం, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్, 100 పడకల ఆసుపత్రి, షిప్పింగ్ హార్బర్, ఆక్వా యూనివర్సిటీ వంటి వాటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 18న జరగనున్న సీఎం జగన్ పర్యటనకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం నర్సాపురంలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై పూర్తి దృష్టి సారించాలని, నక్కవారిపేటలో హెలిప్యాడ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక సీఎం పర్యటనలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE