గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద నూతనంగా గోశాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఈ గోశాలను సీఎం వైఎస్ జగన్ సందర్శించారు. సీఎం నివాస ప్రాంగణంలో నిర్మించిన ఈ గోశాలను పూర్తిగా సంప్రదాయబద్దంగా, మట్టిపెంకులు, వెదురు బొంగులు, తడికెలతో పర్యావరణహితంగా నిర్మించారు. గోశాలకు పలు దేశీ జాతులకు చెందిన ఆవులను తీసుకొచ్చారు. ఈ సందర్శన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ గోశాల విశేషాలను తెలుసుకుంటూ, గోవులను నిమురుతూ ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ