ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవలే వ్యాయామం చేస్తుండగా సీఎం వైఎస్ జగన్ కాలికి గాయమయిన సంగతి తెలిసిందే. మరోసారి కాలుకు వాపు రావడంతో పరీక్షల కోసం తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి సీఎం వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కాలికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటుగా ఆసుపత్రిలో ఉన్న సీఎం వైఎస్ జగన్, వైద్య పరీక్షల అనంతరం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ