తుంగభద్ర పుష్కరాలకు హాజరుకానున్న సీఎం వైఎస్‌ జగన్‌

AP CM YS Jagan, AP CM YS Jagan will Attend to Tungabhadra Pushkaralu, CM YS Jagan Invited to Tungabhadra Pushkaralu, Mango News, Tungabhadra, Tungabhadra Pushkaralu, Tungabhadra Pushkaralu 2020, Tungabhadra Pushkaralu 2020 Dates, Tungabhadra Pushkaralu Latest News, Tungabhadra Pushkaralu to begin from Nov 20, Tungabhadra Pushkaram, YS Jagan will Attend Tungabhadra Pushkaralu

నవంబర్ 20 వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి నవంబర్ 20, శుక్రవారం నాడు తుంగభద్ర పుష్కరాలకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి సీఎం పర్యటన ఖరారయింది. నవంబర్ 20న కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌ను సీఎం వైఎస్ జగన్ సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పుష్కర ఘాట్ సందర్శన సందర్భంగా సీఎం వెంట జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపారు.

కరోనా నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా పర్యటన సాగే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం‌ పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =