కరోనా సమయంలో పోలీసుల పనితీరు, కృషి అద్భుతమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు. ఆదివారం నాడు డీజీపీ గౌతమ్ సవాంగ్ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ -19 పై పోరులో ఏపీ దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధుల నిర్వహిస్తున్న రాష్ట్రంలోని 78 వేల మంది పోలీసులను అభినందిస్తున్నానన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 466 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉన్నామని డీజీపీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu