ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి చేరుకొని, రాత్రికి వన్ జన్పథ్ లో బస చేయనున్నారు. రేపు ఉదయం (ఆగస్టు 7, ఆదివారం) 9.15 గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుని, 9.15 గంటల నుంచి 4.30 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరగనున్న నీతి ఆయోగ్ ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. సమావేశం అనంతరం సాయంత్రం 5.35 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగుపయనమై, రాత్రి 8.15 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.
ఇక శనివారం ముందుగా శ్రీకాకుళం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం, 3.40 గంటలకు ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. సాయంత్రం 5.20 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ వెళ్ళనున్న సీఎం, 6.55 గంటలకు నార్సింగి ఓమ్ కన్వెన్షన్లో జీవీ.ప్రతాప్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. అనంతరం రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY