ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణిత సమయంలో పూర్తిచేసేందుకు కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో జూలై 14, బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పోలవరంలో క్షేత్రస్థాయిలో పనులు పురోగతి, పూర్తైన నిర్మాణాలను సీఎం వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించనున్నారు. ఆ తర్వాత అక్కడి సమావేశ మందిరంలో పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి పోలవరానికి వెళ్లి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ