గిరిజనులలో కోవిడ్ వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచడానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కెసి తండాలో గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పట్ల గిరిజనులలో ఉన్న అపోహలు తొలగించడం, వారిలో 100% వ్యాక్సినేషన్ సాధించడం లక్ష్యాలుగా గవర్నర్ గిరిజన తండాలో వారితో పాటు రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోనున్నారు. గవర్నర్ మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ను ఇంతకుముందే పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకున్నారు. మరోవైపు గిరిజనులకు వంద శాతం వ్యాక్సినేషన్ జరగాలని గవర్నర్ గతంలోనే పిలుపునిచ్చారు. ఈ దిశగా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు గవర్నర్ గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకోనున్నారు. మారూమూల ప్రాంతాలలో ఉన్న ఆదివాసి గిరిజనులందరికీ కూడా ప్రాధాన్యం ఇచ్చి, వ్యాక్సిన్ ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ