ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (డిసెంబర్ 14, బుధవారం) విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. అలాగే గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో జరగనున్నమాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు.
ముందుగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు విశాఖజిల్లా భీమునిపట్నం మండలంలోని దాకమర్రికి చేరుకుని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ విశాఖ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకొని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఆ తర్వాత సీఎం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE