ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 27, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,799 కు చేరుకుంది. శుక్రవారం 9AM నుంచి శనివారం 9AM వరకు 37,041 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. ఇక కరోనా వలన కొత్తగా ఎటువంటి మరణం సంభవించలేదు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7169 గా ఉంది. గత 24 గంటల్లో 86 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,81,963 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 667 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ