ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 17, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,010 కు చేరుకుంది. మంగళవారం 9AM నుంచి బుధవారం 9AM వరకు 26,474 కరోనా పరీక్షలు నిర్వహించగా 51 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక కరోనా వలన కొత్తగా చిత్తూరు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7165 కి పెరిగింది. గత 24 గంటల్లో 57 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,81,238 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 607 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ