ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 18, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,066 కు చేరుకుంది. ఆదివారం 9AM నుంచి సోమవారం 9AM వరకు 27,861 కరోనా పరీక్షలు నిర్వహించగా 81 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7141 కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 263 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,77,212 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1713 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ