ఏపీలో 1900 దాటిన కరోనా మరణాలు, 24 గంటల్లో 97 మంది మృతి

AP Corona Updates, andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత నాలుగు రోజులుగా 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 10080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 10080 కేసులతో కలిపి ఆగస్టు 8, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం‌ కేసుల సంఖ్య 217040 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) రికార్డ్ స్థాయిలో 62123 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.

ఇక రాష్ట్రంలో మరో 97 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా వలన గుంటూరులో పద్నాలుగు మంది, అనంతపూర్ జిల్లాలో పదకొండు మంది, కర్నూల్ లో పదిమంది, పశ్చిమగోదావరిలో పదిమంది, చిత్తూరులో ఎనిమిది మంది, నెల్లూరులో ఎనిమిది మంది, ప్రకాశంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కడపలో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1939 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 129615 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 9151 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 85486 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =