టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన యువగళం పాదయాత్ర 1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ మేరకు 77వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని శివారు క్యాంప్ సైట్ నుండి ప్రారంభించిన యాత్ర.. సిరిగుప్ప క్రాస్ వద్ద పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా.. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నారా లోకేష్ సిరిగుప్ప క్రాస్ వద్ద పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎస్సీ సంఘం, ముస్లిం ప్రజలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 6 గంటలకు కడికత్త క్రాస్ వద్ద బహిరంగ సభలో నారా లోకేష్ ప్రసంగించనున్నారు. కాగా ఈ పాదయాత్రలో లోకేష్ అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ, ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను వింటూ ఉత్సాహంగా నడుస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE