ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పటికే అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినేట్ భేటీలో చర్చించే అంశాలపై అన్ని శాఖలకు సంబంధించి నివేదికలను జూన్ 28వ తేదీ లోగా పంపాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణ, థర్డ్ వేవ్పై సన్నద్ధత, కర్ఫ్యూ సడలింపు, వ్యవసాయం-ఖరీఫ్ పంటల ఏర్పాట్లు, రాష్ట్రంలో అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సహా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ