ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6555 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6555 కేసులతో కలిపి అక్టోబర్ 2, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 7,06,790 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 70,399 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన కృష్ణాలో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, కడపలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5900 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 6,43,993 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 7485 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 56897 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu