ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో మరో 845 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 812 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 29, విదేశాల నుంచి వచ్చిన వారు నలుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన 845 కేసులతో కలిపి జూలై 2, గురువారం ఉదయానికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16097 కు చేరింది. గత 24 గంటల్లో 14,285 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
మరోవైపు కృష్ణాలో ఒకరు, కర్నూల్ లో ఒకరు, శ్రీకాకుళం లో ఒకరు, అనంతపూర్ లో ఒకరు, గుంటూరులో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 198 కి చేరింది. ఇక రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటికే 7313 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6673 మంది ఆసుపత్రుల్లో, 1913 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 8586 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 02/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 13,625 పాజిటివ్ కేసు లకు గాను
*5868 మంది డిశ్చార్జ్ కాగా
*198 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,559#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/J6WIxspMj5— ArogyaAndhra (@ArogyaAndhra) July 2, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu