ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9024 కరోనా పాజిటివ్ కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9024 కేసులతో కలిపి ఆగస్టు 11, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 244549 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) రికార్డ్ స్థాయిలో 58315 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.
ఇక రాష్ట్రంలో కరోనా వలన అనంతపూర్ జిల్లాలో పదమూడు మంది, చిత్తూరులో పన్నెండు మంది, గుంటూరులో తొమ్మిది మంది, ప్రకాశంలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, కడపలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూల్ లో ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2203 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 154749 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 9113 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 87597 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu