ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మే 2, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1525 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5943 సాంపిల్స్ కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా కర్నూల్ జిల్లాలో 25, కృష్ణా జిల్లాలో 12, నెల్లూరు లో 6, కడప, అనంతపూర్, విశాఖపట్నం జిల్లాలలో 4 కేసుల చొప్పున, తూర్పు గోదావరిలో 3, గుంటూరు జిల్లాల్లో 2, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కో కేసు చొప్పున మొత్తం 62 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1525 కు పెరిగింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1525 పాజిటివ్ కేసులకు గాను 441 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం 1051 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 71
- చిత్తూరు – 80
- కర్నూల్ – 436
- కడప – 83
- తూర్పుగోదావరి – 45
- పశ్చిమ గోదావరి – 59
- నెల్లూరు -90
- ప్రకాశం – 61
- గుంటూరు – 308
- కృష్ణా – 258
- శ్రీకాకుళం – 5
- విజయనగరం – 0
- విశాఖపట్నం – 29
#CovidUpdates: రాష్ట్రంలో గత 24 గంటల్లో 5943 సాంపిల్స్ ని పరీక్షించగా 62 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1525 పాజిటివ్ కేసు లకు గాను 441 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1051#APFightsCorona pic.twitter.com/gPCGANrUCY— ArogyaAndhra (@ArogyaAndhra) May 2, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu