ఏపీలో భారీగా కరోనా కేసులు: 24 గంటల్లో 1555 కేసులు, 13 మరణాలు నమోదు

AP Covid-19 Updates : 1555 New Positive Cases, 13 Deaths Reported Today

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1555 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1500 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 53, విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు. కొత్తగా నమోదైన 1555 కేసులతో కలిపి జూలై 9, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం‌ కేసుల సంఖ్య 23814 కు చేరింది. గత 24 గంటల్లో 16,882 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మరోవైపు కరోనా వలన కర్నూల్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు, చిత్తూరులో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 277 కి చేరింది.

ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 9, ఉదయం 10 గంటల వరకు) :

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 23814
కొత్తగా నమోదైన కేసులు : 1555
నమోదైన మరణాలు : 13
డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 12154
యాక్టీవ్ కేసులు : 11383
మొత్తం మరణాల సంఖ్య : 277

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 19 =