నగర వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుభవార్త చెప్పారు. ద్విచక్రవాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లపై 75% వరకు రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. వాహనదారులు ఆన్లైన్ ద్వారా పెండింగ్ చలాన్ల చెల్లింపులు చేయవచ్చని తెలిపారు. చలాన్లపై ప్రకటించిన రాయితీ మార్చి 1 నుంచి 30 వరకు మాత్రమే అని స్పష్టం చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో 1.75 లక్షల చలాన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. భారీ రాయితీల వలన వాహనదారులకు ఉపశమనం కలుగనున్నట్లు తెలిపారు. ఈ అద్భుత అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సీపీ వాహనదారులకు సూచించారు.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మరియు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు రెండు కమిషనరేట్లలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్ చెల్లింపులపై ‘వన్-టైమ్ డిస్కౌంట్’ ప్రకటించారు. దీని వలన గతంలో మాస్క్ ధరించని వ్యక్తులకు రూ.1000 ఫైన్ ఉండగా.. ప్రస్తుతం రాయితీ అనంతరం కేవలం రూ.100 కడితే సరిపోతుందని, రూ.900 వరకు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఈ చలాన్ల చెల్లింపునకు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, మీ సేవ, ఈ సేవ వంటి సేవలు వినియోగించుకోవచ్చు అని చెప్పారు. ఆర్టీసీ బస్లకు 70%, లైట్ మోటార్ వేహికిల్, భారీ మోటార్ వాహనాలకు 50%, తోపుడు బండ్లకు 75% వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ