ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 11వ తేదీన జరగనున్న నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మొత్తం 20 మంది వరకు కొత్త మంత్రులు ఉండొచ్చని, ప్రమాణస్వీకార సమయంలో ఏదేని అవసరం కోసం వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాలని, అదే సమయంలో బందోబస్తు ఏర్పాట్లు కూడా పటిష్టంగా ఉండాలని సంబంధిత శాఖల కార్యదర్శులను, పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నూతన మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఐజీలు సి.త్రివిక్రమ వర్మ, రాజశేఖర్ పాల్గొన్నారు. అలాగే వీడియో సమావేశం ద్వారా గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ