ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కరోనా బారిన పడ్డారు. ఇటీవలే పంజాబ్ రాష్ట్రంలోని మొహలీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) క్యాంపస్లో పబ్లిక్ పాలసీ కోర్సులో అడ్వాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ క్లాసులకు అటెండ్ అయిన సందర్భంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. అక్కడ ఆయన రోకుజు దాదాపు 14 గంటలు క్యాంపస్ లోనే గడపాల్సి రావడం, కొంత ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత హైద్రాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకున్న వంశీ వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. తాజాగా మళ్ళీ ఆయన కరోనా బారిన పడటంతో కుటుంబ సభ్యులు కొంత ఆందోళనకు గురువుతున్నారు. కాగా ప్రస్తుతం వంశీ హైదరాబాద్లో హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. గతంలో కూడా వంశీ ఒకసారి కరోనా బారినపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ