ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం ఉదయం ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్స్/మున్సిపాలిటీల పరిధిలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు రాష్ట్రంలో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న గవర్నర్ దంపతులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా రాజ్భవన్ సమీపంలో ఉన్న సీవీఆర్జీఎంసీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ ఓటును హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ