ఢిల్లీకి ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌, మూడు రోజుల పర్యటన

AP Governor Biswabhusan Harichandan Went to New Delhi on 3-Day Visit

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అలాగే గురువారం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న గవర్నర్ల సదస్సులో బిశ్వభూషణ్ హరిచందన్‌ పాల్గొననున్నారు. ఇక శుక్రవారం సాయంత్రానికి ఢిల్లీ నుంచి గవర్నర్ విజయవాడలోని రాజ్‌భవన్‌ చేరుకోనున్నారు. ఈ ఢిల్లీ పర్యటనకు గవర్నర్ వెంట గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటుగా ఉన్నతాధికారుల బృందం కూడా వెళ్ళింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − seven =