దేశంలో జూలై 16, శుక్రవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,26,829 కు చేరుకుంది. 3,01,83,876 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 4,30,422 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో గత నెలలతో పోల్చితే దేశంలో పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టినా, థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉన్న కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు.
ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలు, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, థర్డ్ వేవ్ సన్నద్ధత తదితర అంశాలపై కీలకంగా చర్చించే అవకాశమునట్టు సమాచారం. మరోవైపు ఇటీవలే ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ