ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారు నియామకంపై ఆగస్టు 27, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి ని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంబటి కృష్ణారెడ్డికి కేబినెట్ ర్యాంక్ స్థాయి హోదా కల్పించారు. అలాగే ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. వ్యవసాయం, సంబంధిత అంశాలపై అంబటి కృష్ణారెడ్డి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu