ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ ను నియమించింది. కేబినెట్ ర్యాంక్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా రజనీష్ కుమార్ రెండేళ్ల పాటుగా సేవలు అందించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రజనీష్ కుమార్ పలు ఆర్థిక సంస్థల్లో విధులు నిర్వహించి, అనుభవం కలిగివున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ధిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ నియమకంకై ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ