మాటల తూటాలు పేల్చడంలో మంత్రి రోజాకు ఎవరూ సాటిలేరు. ప్రత్యర్థులను ఏకిపారేయడంలో ఆమెను మించిన వారుండరు. ఎప్పటిక్పపుడు ప్రత్యర్థులను ఉతికారేస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటారు. విమర్శల తూటాలతో తూట్లు పొడుస్తుంటారు. సీఎం జగన్పై ఎవరైనా కామెంట్లు చేస్తే చాలు.. వెంటనే రియాక్ట్ అవుతుంటారు. వారిపై నిప్పులు చెరుగుతుంటారు. అందుకే ఏపీలో ఫైర్ బ్రాండ్గా రోజా పేరు తెచ్చుకున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో మంత్రి రోజా ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు. తాజాగా టంగ్ స్లిప్ అయి.. రోజా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్లపై విమర్శలు చేస్తూ.. ఓ కులాన్ని తక్కువ చేస్తూ మాట్లాడారు. దీంతో ఆ కుల పెద్దలు.. రోజా వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇటీవల రోజా కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయులు, పవన్ కల్యాణ్లపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. వారిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈక్రమంలో చంద్రబాబు , పవన్ కల్యాణ్లను బుడబుక్కల వారితో పోలుస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో బుడబుక్కల వర్గానికి చెందిన వారు రోజాపై భగ్గుమంటున్నారు. తమ కులాన్ని తక్కువ చేసి మాట్లాడే హక్కు రోజాకు ఎవరిచ్చారని నిలదీశారు. రోజా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు పెనుగంచిప్రోలుకు చెందిన బుడబుక్కల వర్గానికి చెందిన పెద్దలు పోలీసులను ఆశ్రయించారు. తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడినందుకు గానూ.. రోజాపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేశారు. అయితే మంత్రి రోజా మాత్రం ఈ వివాదంపై ఇప్పటి వరకు స్పందించలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ