ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్స్, ఇతర తినుబండారాల దుకాణాలు (ఈటరీస్) అర్ధరాత్రి 12 గంటల వరకు తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్స్, ఈటరీస్ తెరిచివుంచే సమయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లు మినహా రాష్ట్రంలో ఇతర ఆహార సంబంధిత దుకాణాలు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తెరుచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కేంద్రం జారీచేసిన కోవిడ్ నిబంధనల గడువు మార్చి, 2022తోనే ముగియడంతో, ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు. అయితే వ్యాపారస్తులు, వినియోగదారులు మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగం వంటి నిబంధనలు పాటించాలని సూచించారు. కాగా ఏపీ హోటల్ పరిశ్రమ సంఘాల విజ్ఞప్తి మేరకే అర్ధరాత్రి 12 గంటల వరకు సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY