జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా పలు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 19వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. సాగు నష్టాలతో, అప్పుల భారంతో కుంగిపోయి సుమారు 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఆ కుటుంబాలను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని నాదెండ్ల మనోహర్ అన్నారు.
పర్చూరు నియోజకవర్గం పరిధిలో జనసేన బహిరంగ సభ:
సోమవారం సాయంత్రం ప్రకాశం జిల్లా పార్టీ నాయకులతో నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న పక్షంలో రూ.7 లక్షలు ఆర్థిక సాయం అందించాలి. ఈ సాయం అందించటం లేదు. కౌలు రైతులకు అండగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ భరోసా యాత్ర చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. జూన్ 19వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ యాత్ర ఉంటుంది. పర్చూరు నియోజకవర్గం పరిధిలో బహిరంగ సభ నిర్వహించనున్నాం” అని తెలిపారు. అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY